బిజినెస్

స్టాక్ మార్కెట్లకు దూరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. ఫిబ్రవరిలో మాత్రం తీరు మార్చుకున్నారు. మార్చిలో, ప్రస్తుత నెల ఏప్రిల్‌లోనూ అదే పోకడ కనబరుస్తున్నారు. గత నెలలో రికార్డు స్థాయలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. ఈ క్రమంలో ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 19 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చారు. అయతే స్టాక్ మార్కెట్ల కంటే కూడా రుణ మార్కెట్లలో పెట్టుబడులకు ఈ నెలలో ఎఫ్‌పిఐలు అమితాసక్తిని కనబరుస్తుండటం విశేషం. కాగా, వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 1,132 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి 17,758 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం 18,890 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఈ నెల 3-21 తేదీల మధ్య వచ్చినట్లైంది. మరోవైపు గత నెల మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా చూస్తే అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి మొత్తం 87,517 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. కాగా, 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్ల (23,079 కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు. అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జనవరితో కలుపుకుని 80,310 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ప్రధానంగా పార్లమెంట్‌లో జిఎస్‌టి ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో భారతీయ మార్కెట్ల నుంచి 2016లో 23,079 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయ నట్లైంది. అయతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి ఒంటరిగా గెలుచుకోవడం మదుపరుల విశ్వాసాన్ని చూరగొంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో లేకపోవడంతో సంస్కరణల అమలు ఆలస్యమవుతుండగా, యుపి గెలుపు కేంద్రంలోని మోదీ సర్కారుకు రాజ్యసభలోనూ మెజారిటీని తెచ్చింది. దీంతో ఇక సంస్కరణలు పరుగులు పెడతాయన్న భావన మదుపరుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది.