బిజినెస్

మూడు రోజుల లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 28: జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల గడువు ముగిసన నేపథ్యంలో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో గత మూడు రోజులుగా లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను చవి చూశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 23 పాయింట్లు నష్టపోయి 24,469.57 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 13.10 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ఆటో, ఐటి రంగాల షేర్లు నష్టపోయాయి. డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల జనవరి సిరీస్ చివరి రోజు కావడంలో ట్రేడింగ్ చివర్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో పాటుగా ఇప్పటివరకు ప్రకటించిన కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేక పోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు మార్కెట్లను దెబ్బతీశాయని బ్రోకర్లు చెప్పారు. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరింత పెంచుతామని అమెరికా ఫెడల్ రిజర్వ్ తన విధాన సమీక్ష సమావేశం చివర్లో సూచన ప్రాయంగా తెలియజేయడం కూడా మార్కెట్ మూడ్‌పై ప్రభావం చూపించిందని వారంటున్నారు. ఇవన్నీ కలిసి పెద్ద ఎత్తున అమ్మకాలకు కారణమయ్యాయి.
ఫలితంగా నిన్నటి ముగింపుకన్నా దిగవలో ప్రారంభమైన సెనె్సక్స్ ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతూ చివరికి దాదాపు 23 పాయింట్ల నష్టంతో 24,469.57 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్స్‌లో సెనె్సక్స్ 530 పాయింట్లకు పైగా లాభపడిన విషయం తెలిసిందే. నిఫ్టీ సైతం 13.10 పాయింట్లు నష్టపోయి 7,424.65 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా కేంద్ర బ్యాంక్ మరోసారి పెద్ద మొత్తంలో నగదును వ్యవస్థలోకి తీసుకు వచ్చినప్పటికీ మదుపరుల్లో విశ్వాసం నింపలేక పోవడంతో షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పడిపోయింది. జపాన్ సూచీ నిక్కీ సైతం 0.71 శాతం పడిపోయింది. అయితే హాంకాంగ్ మార్కెట్ సూచీ మాత్రం 0.75 శాతం మేర పెరిగింది. సెనె్సక్స్‌లోని ప్రధాన కంపెనీలయిన ఎల్‌అండ్‌టి, యాక్సిస్ బ్యాంక్ బిహెచ్‌ఇఎల్, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ లాంటి షేర్లు 2.72 శాతంనుంచి 1.67 శాతం దాకా పడిపోయాయి. కాగా, గురువారం త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు కూడా భారీగానే నష్టపోయాయి. హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్, సిప్లా, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సిలాంటి ప్రముఖ కంపెనీల షేర్లూ నష్టపోయాయి. అయితే హిందుస్థాన్ యూనిలీవర్,ఎంఅండ్‌ఎం, ఐటిసి, రిల్, సన్‌ఫార్మా, గెయిల్,లుపిన్‌లాంటి కంపెనీల షేర్లు ఇంత ఒత్తిడినీ తట్టుకొని మంచి లాభాలు ఆర్జించడంతో మార్కెట్ల పతనం కొంతమేరకు ఆగింది. మొత్తంమీద సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 16 షేర్లు నష్టపోగా, 14 లాభపడ్డాయి.
ఎస్సార్ ఆయిల్ షేర్ల ట్రేడింగ్
10 నుంచి నిలిపివేత
ఇదిలా ఉండగా ఎస్సార్ ఆయిల్ స్వచ్ఛంద డీలిస్టింగ్ నిబంధనలను పూర్తిగా పాటించినందున వచ్చే నెల 10నుంచి బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో ఆ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేయనున్నారు. అయితే ఇప్పటికీ మిగిలి ఉన్న వాటాదారులు వైదలగడానికి డీలిస్టింగ్ తేదీనాటినుంచి ఏడాది పాటు అవకాశముంటుందని బిఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలిపింది.

పర్యాటక ఆదాయంపై ఏపి దృష్టి

10 జిల్లాల్లో బీచ్ రిసార్టులు, కనె్వన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 28: పర్యాటకులను ఆకర్శించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ, విదేశాల్లో పర్యాటక రంగం అందిస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పలు పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో నూతన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కడప, నెల్లూరు, శ్రీకాకుళం మినహా ఇతర అన్ని జిల్లాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని పర్యాటకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పే ఈ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచించింది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో పర్యాటకులను ఆకర్శించడానికి బీచ్ రీసార్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంతేగాక పలు జిల్లా కేంద్రాల్లో కనె్వన్షన్ సెంటర్లు, ఎగ్జిబిషన్, హోటళ్లు నిర్మించి ఆయా నగరాల ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. పర్యాటకశాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో విజయనగరం జిల్లా తాటిపూడిలో రూ. 9 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో లేక్ రీసార్టు, విజయనగరంలో రూ. 40 కోట్లతో కనె్వన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటల్ నిర్మించనున్నారు. విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలంలో కనె్వన్షన్ సెంటర్, రెస్టారెంట్, రుషికొండలో రూ. 50 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో బీచ్ రీసార్టు ప్రతిపాదించారు. గాజువాక, షీలానగర్‌లో రూ. 10 కోట్లతో షాపింగ్‌మాల్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎండాడలో రూ. 25 కోట్లతో బీచ్ రీసార్టు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోగులంకలో రూ. 10 కోట్ల వ్యయంతో 13.62 ఎకరాల్లో రీసార్టు, చింతలమోడిలో 10 ఎకరాల్లో రూ. 10కోట్లతో బీచ్ రీసార్టుకు ప్రతిపాదించారు. పుణ్యక్షేత్రం అన్నవరంలో రూ. 10 కోట్ల ఖర్చుతో హోటల్ నిర్మించనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 40 కోట్లతో బీచ్ రీసార్టు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కృష్ణా జిల్లా మంగినపూడిలో రూ. 40 కోట్లతో బీచ్ రీసార్టు ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా సూర్యలంకలో 8 ఎకరాల విస్తీర్ణం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, వాడ్రేవు, చీరాలలో బీచ్ రీసార్టు నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఒంగోలు పట్టణంలో రూ. 30 కోట్ల వ్యయంతో కనె్వన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటల్ నిర్మాణానికి సిఫారసు చేశారు. చిత్తూరు జిల్లా హార్స్‌లీహిల్స్‌లో రూ. 50 కోట్ల ఖర్చుతో 5 స్టార్ హోటల్, చిత్తూరు నగరంలో రూ. 25.5 కోట్లతో 3 స్టార్ హోటల్ నిర్మించడానికి అనుమతించాలని కోరారు. హార్స్‌లీ హిల్స్‌లో రోప్‌వే ఏర్పాటుకు ప్రతిపాదించారు. కళ్యాని డ్యాంలో లేక్ రీసార్టు నిర్మించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కనె్వన్షన్ సెంటర్, హోటల్, ఎగ్జిబిషన్‌తో పాటు బెలూంగుహల వద్ద రీసార్టు నిర్మాణానికి పర్యాటకశాఖ ప్రయత్నిస్తోంది. అనంతపురం నగర శివారులో నిర్మించిన శిల్పారామంలో కనె్వన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటల్ నిర్మించాలని, గుత్తికోటలో రోప్‌వే ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను రానున్న మూడేళ్లలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.