బిజినెస్

రెండు గంటల్లోనే ఓవర్ సబ్‌స్క్రైబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్‌టిపిసి వాటా విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రారంభమైన రెండు గంటల్లోనే ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. రూ. 5,030 కోట్ల విలువైన 5 శాతం వాటాను ఎన్‌టిపిసి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఉపసంహరించుకుంటుండగా, మంగళవారం విదేశీ, దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. ఒక్కో షేర్ ధర రూ. 122 ఉండగా వీటి కోసం దాదాపు 7,287 కోట్ల రూపాయల విలువైన దరఖాస్తులు వచ్చా యి. రెండు రోజులపాటు జరిగే ఈ ఒఎఫ్‌ఎస్‌లో సంస్థాగత మదుపరులకు మొత్తం 41.22 కోట్ల షేర్లలో 32.98 కోట్లకుపైగా షేర్లను కేటాయించారు. బుధవారం మిగతా షేర్లకు రిటైల్ మదుపరుల నుంచి బిడ్లను స్వీకరించనున్నారు. ఎన్‌టిపిసిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 74.96 శాతం వాటా ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇఐఎల్, ఐఒసి, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లలో ప్రభుత్వం వాటాలను అమ్మేయగా, వీటి ద్వారా ఖజానాకు రూ. 13,300 కోట్ల ఆదాయం సమకూరింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 69,500 కోట్ల రూపాయల నిధులను అందుకోవాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగలేకపోతోంది.