ఆంధ్రప్రదేశ్‌

భూబాగోతంపై విచారణ జరపండి: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి రాజధాని ఎక్కడన్న విషయం తేలడానికి మూడు నెలల ముందే ఆ ప్రాంతంలో టిడిపి నాయకులు భూములు ఎలా కొన్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం భూములు భారీగా కొనుగోలు చేసి, ఆ ప్రాంతంలోనే రాజధాని నిర్మిస్తామని ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఈ భూబాగోతంపై సిబిఐ చేత విచారణ జరిపించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైనా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూముల వ్యవహారంపై అప్పటి సిఎం రాజశేఖరరెడ్డి విచారణ జరిపించారని ఆయన గుర్తు చేశారు. సినీ నటుడు, టిడిపి ఎంపీ మురళీ మోహన్ కాంగ్రెస్ హయాంలో భూములు ఎందుకు కొనలేదని బొత్స నిలదీశారు.