బిజినెస్

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు దాదాపు 5,500 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడం మదుపరులను కొనుగోళ్ళ వైపు నడిపించింది. నవంబర్‌లోనూ ఎఫ్‌పిఐలు స్టాక్ మార్కెట్ల నుంచి 7,074 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే అక్టోబర్‌లో 6,650 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. అయినప్పటికీ నవంబర్ నుంచి ఎఫ్‌పిఐల ఆలోచనా సరళి మారగా, ఇప్పటికీ అదే ధోరణితో ముందుకెళ్తున్నారు. ఫలితంగా ఈ నెల 1-11 తేదీల్లో భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి 5,487 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వెళ్ళిపోయాయి. ఇకపోతే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్ల నుంచి 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరిం చుకున్నప్పటికీ, అక్టోబర్‌లో స్టాక్, రుణ మార్కెట్లలోకి తిరిగి 22,350 కోట్ల రూపాయల (3.44 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా అక్టోబర్ నెలలో ఏడు నెలల గరిష్ఠానికి ఎఫ్‌పిఐ పెట్టుబడులు చేరినట్లైంది. మార్చి (రూ. 20,723 కోట్లు) తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే భారీగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయ. కాగా, ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య సెప్టెంబర్‌లో 5,784 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు వెనక్కి తీసుకోగా, అంతకుముం దు నెల ఆగస్టులోనైతే ఏకంగా 17,524 కోట్ల రూపాయలను గుంజేసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఏప్రిల్ వరకు దేశీయ మార్కెట్లలో నెలసరి విదేశీ పెట్టుబడులు క్రమేణా తగ్గుతూ వచ్చాయ. జనవరిలో 33,688 కోట్ల రూపాయలుగా ఉన్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు.. ఫిబ్రవరిలో 24,564 కోట్ల రూపాయలుగా, మార్చిలో 20,723 కోట్ల రూపాయలుగా, ఏప్రిల్‌లో 15,333 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో పెట్టుబడులు రాకపోగా, వెనక్కి వెళ్లిపోయాయి. మే నెలలో 14,272 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. జూన్‌లో 1,608 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు లాగేసుకున్నారు. జూలైలో మళ్లీ పెట్టుబడుల రాక మొదలైనా.. ఆగస్టులో తిరిగి పెట్టుబడుల పోకడే మిగిలింది. జూలైలో 5,323 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో పరిస్థితులు మళ్లీ గాడిలో పడ్డాయనుకుంటే ఆగస్టులో అందుకు విరుద్ధంగానే ఫలితాలు నమోదయ్యాయ. సెప్టెంబర్ లోనూ తీరు మారలేదు. అయతే ఆర్‌బిఐ అనూహ్యంగా సెప్టెంబర్ 29న నిర్వహించిన నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లైన రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయంట్ల చొప్పున తగ్గించడంతో నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు అక్టోబర్‌లో లాభాల్లో కదలాడాయ. కానీ నవంబర్‌లో మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణే జరుగుతోంది. 15 రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సరళతరం చేయడంతో విదేశీ మదుపరులు మధ్యలో తిరిగి పెట్టుబడు లకు ఆసక్తి కనబరిచినప్పటికీ ఫలితం లేకపోయంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై నెలకొన్న సందిగ్ధత స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒడిదుడుకులకు లోను చేస్తోంది. బిల్లు ఆమోదంపై ఏర్పడుతున్న అనుమానాలే కారణం. కాగా, ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,136 కోట్ల రూపాయలుగా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 50,976 కోట్ల రూపాయలుగా ఉంది.