బిజినెస్

స్టాక్ పెట్టుబడులపై ‘మారిషస్’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నడుస్తున్నారు. గత రెండు వారాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి 178 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను లాగేసుకున్నారు. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 29,558 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏప్రిల్‌లో జరిపిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఐదేళ్ల కనిష్టానికి తగ్గిస్తూ 6.5 శాతానికి తీసుకురావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. కానీ ఈ నెలలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మారిషస్‌తో భారత పన్ను ఒప్పందాల సవరణ వంటివి విదేశీ మదుపరుల కొనుగోళ్ల ఆసక్తిని దెబ్బతీశాయ. దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి గడచిన రెండు వారాల్లో 178 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. అయతే ఇదే సమయంలో రుణ మార్కెట్లలోకి 595 కోట్ల రూపాయల విలువైన విదేశీ పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనైతే ఏకంగా 41,661 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ఫిబ్రవరి నెలాఖర్లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ అనంతరం పరిస్థితులు మారిపోయాయ. ద్రవ్యలోటును జిడిపిలో 3.5 శాతానికే కట్టడి చేస్తామన్న జైట్లీ వ్యాఖ్యలు స్వదేశీ మదుపరుల తోపాటు విదేశీ మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయ. ఈ క్రమంలోనే పెట్టుబడులు భారీగా తరలిరాగా, మార్చి నెలలో దేశీయ స్టాక్, రుణ మార్కెట లలోకి ఎఫ్‌పిఐలు 19,967 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. గత నెలలోనూ 8,416 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల లోకి మరో 6,418 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం క్యాపిటల్ మార్కెట్లలోకి ఏప్రిల్‌లో వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 14,834 కోట్ల రూపాయలు (2.23 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటి దాకా స్టాక్ మార్కెట్లలోకి 12,733 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 345 కోట్ల రూపాయల పెట్టుబడుల తరలిపోయా య. దీంతో ఈ ఏడాది నికర విదేశీ పెట్టుబడుల విలువ 12,388 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు నిరుడు (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తంగా అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ మదుపరుల పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది.