బిజినెస్
ఈక్విటీ మార్కెట్లో మరిన్ని ఇపిఎఫ్ఒ పెట్టుబడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మే 15: ఈక్విటీ మార్కెట్లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 6,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అయితే ఈ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ట్రస్టీస్ తర్వాతి సమావేశంలో ఈ నిర్ణయం వెలువడుతుందన్నారు.
కాగా, నిరుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీలకు చెందిన ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దాదాపు 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇపిఎఫ్ఒ పెట్టినది తెలిసిందే. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం (2015-16) కంటే, ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులను పెట్టనున్నామని శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు. ఈ మేరకు ఆదివారం పిటిఐ వర్గాలు తెలియజేశాయి.