బిజినెస్

నెలాఖర్లో భారత్‌కు మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ప్రస్తుతం గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సిఇఒ టిమ్ కుక్ భారత్‌లో పర్యటిస్తుండగా, మరో అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల కూడా భారత్‌కు రానున్నారు. ఈ నెలాఖర్లో నాదెళ్ల వస్తుండగా, తెలుగువాడైన నాదెళ్ల గడచిన ఏడు నెలల్లో భారత్‌లో పర్యటిస్తుండటం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక ఈ పర్యటన సందర్భంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, డెవలపర్లను నాదెళ్ల కలుసుకుంటారని తెలుస్తోంది. అంతేగాక ఈ నెల 30న నాదెళ్లతో మైక్రోసాఫ్ట్ ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సారథులు భారత్ బాట పడుతున్నారు. ఇంతకుముందు ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జూకర్‌బర్గ్ భారత్‌లో పర్యటించగా, ఇప్పుడు యాపిల్ సిఇఒ టిమ్ కుక్ దేశంలో సందర్శిస్తున్నారు. కొద్దిరోజుల్లో మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల కూడా రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.