బిజినెస్

ఇన్నోఫ్రోమ్ వేదికగా పారిశ్రామిక విప్లవ శంఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 10: నాలుగో పారిశ్రామిక విప్లం దిశగా అడుగులు వేయని దేశాలు వెనుకబడిపోతాయని రష్యాలో జరుగుతున్న ఇన్నోఫ్రోమ్-2016 సదస్సు అభిప్రాయపడింది. భారత్ భాగస్వామిగా జరుగుతున్న ఈ సదస్సు రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. భారతదేశం తరఫున హాజరైన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభోపన్యాసం చేశారు. పెట్టుబడులకు భారత దేశం సరైన గమ్యస్థానమని అన్నారు. పారిశ్రామ రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆమె తెలియచేశారు. అంతర్జాతీయ వాణిజ్య వేదికకు భారత్ భాగస్వామ్య దేశంగా నిలబడడం రష్యాతో ధృడమైన సంబంధాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెయచేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయంగా వృద్ధి శాతం తిరోగమనంలో ఉన్న తరుణంలో భారత్ 7.5 శాతం వృద్ధి శాతాన్ని నమోదు చేసుకుందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఏడాది మరింత ఆశాజనకమైన వృద్ధి రేటు సాధించగమన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. భారత్ పారిశ్రామికవేత్తలు ప్రపంచ వాణిజ్యవేత్తలతో సత్‌సంబంధాలు నెరుపుతారన్న ఆత్మవిశ్వాసాన్ని సీతారామన్ వ్యక్తం చేశారు.
భారత్ నుంచి ఇంజనీరింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో రష్యా అతిపెద్ద దిగుమతిదారుగా ఉందని సీతారామన్ గుర్తు చేశారు. ఇరు దేశాలూ పరస్పరం సరళతరమైన వాణిజ్యానికి తెర తీశాయని అన్నారు. ద్వైపాక్షిక విణిజ్యాన్ని 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలన్నదే తమ ధ్యేయమని మంత్రి సీతారామన్ వివరించారు. రెండు దేశాలు పెట్టుబడులను మరింత ఆకర్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. భారత్‌లో రష్యన్ పెట్టుబడులను మూడు బిలియన్ డాలర్లు ఉండగా, రష్యాలో భారత్ పెట్టుబడులు ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సీతారామన్ పేర్కొన్నారు. రష్యన్ పెట్టుబడిదారులు భారత్‌కు తరలివచ్చి తమ ఉత్పత్తులను పరిచయం చేయాలని సీతారామన్ ఈ వేదిక మీద నుంచి పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ దేశాల సహకారాన్ని కోరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే తమతమ ప్రతినిధి బృందాలతో ఈ సదస్సుకు హాజరయ్యారు. రష్యా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్‌మంటురోవ్ సదస్సుకు స్వాగతోపన్యాసం చేశారు. భారత్ తరపున 110కి పైగా పారిశ్రామిక సంస్థల ప్రాతినిధ్యంతో కూడిన ఈ ప్రదర్శనలో చైనా, ఇటలీతోపాటు మరికొన్న దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రపంచం నవీన పారిశ్రామిక విప్లవం దిశగా పయనిస్తోందని సమావేశంలో ప్రసంగించిన వక్తలు అభిప్రాయపడ్డారు. దీని ఫలితంగా 2020 నాటికి పారిశ్రామిక రంగంలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత ఏడాది చైనా, ఈసారి భారత్, వచ్చే ఏడాది జపాన్ భాగస్వామ్య దేశాలుగా ఉండే ఈ ఇన్నోఫ్రోమ్ వేదిక అనేక ఆలోచనలకు, పరస్పర వాణిజ్య సహకారానికి దోహదపడగలదని అన్నారు. . సమావేశంలో స్వెర్డిల్వోస్క్ గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందుగా మనం మారాలన్న మహాత్మాగాంధీ మాటలను గుర్తు చేశారు. ఔషధ, ఐటి. ఖనిజ రంగాల్లో పెట్టుబడులకు రష్యాలో అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇన్నోఫ్రోమ్-2016 ఆరంభ వేడుకలకు పెద్దఎత్తున వచ్చిన భారతీయ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను అలరించాయి. భారత్ ప్రతినిధులకు గవర్నర్ విందు ఇచ్చారు.