బిజినెస్

ఆశల పల్లకిలో ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: విదేశీ మదుపరులు జూలైలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 12,600 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, పార్లమెం ట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందగలదన్న ఆశాభావం భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను రప్పించాయ. ముఖ్యంగా జూలై నెలలో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు గడచిన నాలుగు నెలల్లో అత్యధికంగా నిలిచాయ. 12,612 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయ. మార్చి నెలలో 21,143 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ జూలైలోనే ఎక్కువగా రావడం జరిగింది. మరోవైపు రుణ మార్కెట్లలోకి కూడా 6,845 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు జూలైలో పట్టుకొచ్చారు.
దీంతో మొత్తం అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి 19,457 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు (2.89 బిలియన్ డాలర్లు) జూలైలో వచ్చినట్లైంది. నిజానికి జూన్ వరకు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ లేదా ఎఫ్‌ఐఐ) ఆసక్తి కనబరిచారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న (బ్రెగ్జిట్) భయాలు విదేశీ మదుపరులను రుణ మార్కెట్ల వైపు చూడనివ్వలేదు. బ్రెగ్జిట్‌కే బ్రిటనీయులు మద్దతు పలకడంతో మరింత దూరమయ్యారు. అయతే జూలై మొదలు స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోనూ పెట్టుబడులకు మొగ్గు చూపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను సరళతరం చేయడం, నూతన ఖనిజ అనే్వషణ విధానాన్ని ఆమోదించడం, షాపింగ్ సముదాయాలు, సినిమా హాల్స్‌ను 24 గంటలు తెరిచేందుకు అంగీకరించడం వంటి నిర్ణయాలు విదేశీ మదుపరులను ఆకట్టుకున్నాయ. ప్రధానంగా జిఎస్‌టి బిల్లుకు తృణమూ ల్ కాంగ్రెస్, జెడియు వంటి ప్రాంతీయ పార్టీల మద్దతును కేంద్రం కూడగడుతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇప్పటికే లోక్‌సభలో బిల్లు పాసయనది తెలిసిందే. అయతే తమకు మెజారిటీ కలిగిన లోక్‌సభలో బిల్లును నెగ్గించుకున్న మోదీ సర్కారుకు.. మెజారిటీ అంతగాలేని రాజ్యసభ లో ఆమోదించుకోవడం కష్టంగా మారింది. దీంతో ప్రాంతీయ పార్టీల సాయం తీసుకుం టోంది. రాష్ట్రాల సూచనలనూ పరిగణనలోకి తీసుకుని మార్పులు కూడా చేపడుతోంది. ఈ క్రమంలో ఈ వారం రాజ్యసభకు జిఎస్‌టి బిల్లు వస్తోంది. దీంతో బిల్లు పాసవుతుందన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేస్తుండగా, విదేశీ పెట్టుబడులకు తాజా పరిణామాలు కలిసొచ్చా యని అంటున్నారు. మరోవైపు సుదీర్ఘకాలం తర్వాత ఎగుమతులు పుంజుకోవడమూ లాభించింది.
ఫలితంగానే జూలైలో స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రాగలిగాయ. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసం హరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. వర్ష అంచనాలు, ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. కాగా, అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి- జూన్)లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకు న్నారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 31,778 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే రుణ మార్కెట్ల నుంచి 4,723 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 27,055 కోట్ల రూపాయలుగా నమోదైంది.