బిజినెస్

ఇక ‘గోదావరి గ్యాస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: ఉభయ గోదావరి జిల్లాల్లోని గృహాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. గోదావరి గ్యాస్ పేరుతో ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో గెయిల్ 74 శాతం, హెచ్‌సిపిఎల్ 26 శాతం ఈక్విటీ కలిగి ఉంటాయి. పైపు లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేయడం వలన పరిశ్రమలకు డబ్బు ఆదా అవుతుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో గృహాలకు పైపు లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని గెయిల్, హెచ్‌పిసిఎల్ అధికారులను కోరారు.

సిఎం సమక్షంలో ఒప్పంద పత్రాలు
మార్చుకుంటున్న అధికారులు