బిజినెస్

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (గాజువాక), సెప్టెంబర్ 14: విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్తిస్థాయిలో హిందీ భాష అమలుకు కృషి చేస్తున్నం దుకుగాను ప్రతిష్ఠాత్మక రాజభాషా పురష్కారం దక్కింది. స్టీల్ ప్లాంట్ సిఎండి, ఇతర అధికారుల కృషి, పట్టుదల వలన కర్మాగారంలో అన్ని విభాగాల్లో హిందీ భాష అమలు జరుగుతోంది. కార్మికులు, ఉద్యోగులు అన్న తేడా లేకుండా అందరూ హిందీలో మాట్లాడటంతో హిందీ పక్షోత్సోవాలను పురస్కరించుకుని ప్రభుత్వం గుర్తించి రాజభాషా కీర్తి పురస్కారాన్ని అందజేసింది. ఈ అవార్డును బుధవారం ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్లాంట్ సిఎండి మధుసూదన్ అందుకున్నారు. ఉక్కు కర్మాగారానికి రాజభాషా పురస్కారం వరించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా
పురస్కారాన్ని అందుకుంటున్న మధుసూదన్