బిజినెస్
మందగమనంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ భేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 28 December 2015
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ఈ ఏడాది బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం వంటివి కొత్త సంవత్సరంలో తమ ప్రధాన లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు. భౌతిక, సామాజిక వౌలికాభివృద్ధికి 2016లో అధిక నిధులు అందిస్తామని ఆదివారం ఇక్కడ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 7-7.5 శాతం జిడిపి వృద్ధిని సాధిస్తామన్నారు. కాగా, పార్సి కమ్యూనిటీ నుంచి మరింతగా వ్యాపారవేత్తలు రావాల్సిన అవసరం ఉందన్నారు.