జాతీయ వార్తలు

బిఎస్‌ఎఫ్‌కు హైటెక్ కంట్రోల్‌రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో బిఎస్‌ఎఫ్ ఆపరేషన్‌లన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాన్ని వీలుకల్పించే ఓ హైటెక్ కంట్రోల్ రూమర్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నాడు ఇక్కడ ప్రారంభించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని క్షేత్రాలనుంచే అందే ఆన్‌లైన్ సమాచారాన్ని అనుసంధానం చేయడానికి, విశే్లషించడానికి వీలుకలుగుతుంది. అంతేగాకుండా ఎప్పటికప్పుడు బిఎస్‌ఎఫ్ అవసరాలకు తగ్గట్టుగా స్పందించడానికి ఈ కొత్త వ్యవస్థ వల్ల ఉపయోగం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ కొత్త వ్యవస్థ పనితీరు గురించి వివరించారు. అలాగే బిఎస్‌ఎఫ్ సిబ్బంది మానసికంగానూ, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించే ఓ డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.