జాతీయ వార్తలు

ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో మాయవతికి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇపుడు బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరటంతో ఇపుడు కాంగ్రెస్‌కు సొంతంగా మద్దతు లభించినట్లయింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 సభ్యులు ఉండగా కాంగ్రెస్ వంద మంది సభ్యులతో పెద్ద పార్టీగా అవతరించింది. ఇపుడు మరోఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరటంతో కాంగ్రెస్ బలం 106కి చేరింది. ఈ సందర్భంగా బీఎస్పీ ఎమ్మెల్యే జోగిందర్ సింగ్ అవనా తాజా పరిణామాలపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం బీఎస్పీ లేజిస్లేటర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ స్పీకర్‌కు లేఖ ఇచ్చామని తెలిపారు.