ఆంధ్రప్రదేశ్‌

మహిళల పరువు తీసిన రోజా: ఎమ్మెల్యే బోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాటి మహిళ అని కూడా చూడకుండా టిడిపి శాసనసభ్యురాలు అనితపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు సబబేనని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన సోమవారం ఎపి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, రోజా ప్రవర్తించిన తీరుతో మహిళలంతా తలదించుకుంటున్నారన్నారు. మహిళల పరువు తీసిన రోజాను వైకాపా అధినేత సమర్థించడం, ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుపై చర్చ జరుగుతుండగా సభకు గైర్హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు రోజా వ్యవహారం గుణపాఠం కావాలని టిడిపి సభ్యుడు గౌతు శివాజీ అన్నారు.