తెలంగాణ

కాల్వలో ప్రైవేటు బస్సు బోల్తా: పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సోమవారం తెల్లవారు జామున నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి పదిమంది మృత్యువాత పడ్డారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద వంతెనపై నుంచి ఈ బస్సు సాగర్ ఎడమకాల్వలో బోల్తాపడింది. సంఘటన స్థలంలో ఏడుగురు, ఆసుపత్రిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 18 మందిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వేగంగా నడుపుతూ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. సంఘటన సమయంలో 31 మంది ప్రయాణీకులు బస్సులో ఉన్నారు. వీరిలో చాలా మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారే. సోమవారం ఉదయం భారీ క్రేన్ల సాయంతో కాల్వలో నుంచి బస్సును రోడ్డు మీదకు చేర్చారు. పోలీసు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.