బిజినెస్

27 మంది ప్రభుత్వ బ్యాంకర్లు సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ అధికారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. మరో ఆరుగురిని బదిలీ చేసింది. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ వీరంతా నల్లధనం మార్పిడికి పాల్పడుతున్నట్లు ఐటి శాఖ దాడుల్లో గుర్తించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే.