బిజినెస్

ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్‌పట్ల విదేశీ మదుపరుల చూపు నెలకొందని చెబుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓటింగ్ జరగగా, సోమవారం ఉదయం ఫలితాలు వెల్లడి కానున్నాయ. దీంతో సోమవారం ట్రేడింగ్‌పై వీటి ప్రభావం సహజంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నా య. అలాగే అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష కూడా భారతీయ మార్కెట్లను శాసిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. సోమవారం దేశీయ సేవారంగ పిఎమ్‌ఐ గణాంకాలు విడుదలవుతుండగా, బుధవారం రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష జరగనుంది. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత జరుగుతున్న తొలి ద్రవ్యసమీక్ష ఇదే. ఈసారి వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నది తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పాత నోట్లు డిపాజిట్ అవుతున్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులనూ కలవరపెడుతోంది. దీంతో ద్రవ్యవ్యవస్థ లోకి పెరిగే కొత్త నోట్లతోనే మార్కెట్లు లేవడమా? పడిపోవడమా? అనేది తెలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపనున్నాయ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఆ దేశానికేగాక, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని మెజారిటీ మదుపరులు ఎన్నికల సమయంలో పెట్టుబడులను లాగేసుకున్నది తెలిసిందే. ఫలితంగా భారత్‌సహా అన్ని ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయ. అయతే ట్రంప్ గెలవడం, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగం మదుపరులను ఆకట్టుకోవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. కానీ ప్రస్తుత ట్రంప్ విధానాలు మళ్లీ భయాందోళనలకు దారితీస్తున్నాయ. అంతేగాక ఆయన ఎన్నికపై రగులుతున్న వివాదాలూ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయ. ఇకపోతే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, విదేశీ స్టాక్ మార్కెట్ల కదలికలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయ. ముఖ్యంగా రూపాయ మారకం విలువ అన్నింటికంటే అధికంగా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయ విలువ గత నెల తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. దీంతో మరింతగా క్షీణిస్తే ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కచ్ఛితంగా కనిపిస్తుంది. ఫలితంగా మదుపరులు ఫారెక్స్ ట్రేడింగ్‌పైనా దృష్టి సారిస్తారని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.