బిజినెస్

పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 6: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థికంగా చిక్కుల్లోపడిన కోళ్ళ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ పౌల్ట్రీ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంపి జితేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పౌల్ట్రీ సంఘం నాయకులు రంజిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రమేష్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆర్థిక మంత్రితో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు. కొంతకాలంగా కోళ్ళ దాణా ధర పెరిగి పరిశ్రమ ఆర్థికంగా నష్టాల్లో ఉందని, పౌల్ట్రీ రుణాలపై ఈ ఏడాది మారటోరియం ఇవ్వాలని కూడా జైట్లీకి ఈ సంఘం విజ్ఞప్తి చేసింది.