బిజినెస్

కార్లు మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆటోరంగ సంస్థలు వాహన ధరలను పెంచుతున్నాయి. జనవరి 1 నుంచి కార్ల ధరలు రెక్కలు తొడగనున్నాయి. ఉత్పాదక వ్యయం పెరిగిందని, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గిందని ఇప్పటికే టొయోటా, టాటా మోటార్స్, రెనాల్ట్ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచాయి. వచ్చే నెల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిస్సాన్, హ్యుందాయ్ సంస్థలూ తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు తెలిపాయి. నిస్సాన్ కార్ల ధరలు గరిష్ఠంగా 30,000 రూపాయల వరకు పెరగనుండగా, హ్యుందాయ్ కార్ల ధరలు ఒక లక్ష రూపాయల వరకు పెరుగుతున్నాయి.
వాహనాల తయారీలో వినియోగించే ఉక్కు, అల్యూమినియం, కాపర్, రబ్బరు ధరలు పెరిగాయని, మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులూ రూపాయి విలువ పతనంతో ప్రియమయ్యాయని ఆటోరంగ సంస్థలు చెబుతున్నాయి. కాగా, టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలు 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పెరుగుతాయని స్పష్టం చేయగా, రెనాల్ట్, టొయోటా సంస్థలు వివిధ రకాల వాహన ధరల్లో మూడు శాతం పెంపును ప్రకటించాయి.