బిజినెస్
టాటాలపై 3వేల కోట్లకు నస్లి వాడియా పరువు నష్టం కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 December 2016
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కొన్ని టాటా గ్రూపు కంపెనీలకు స్వతంత్య్ర డైరెక్టర్గా ఉన్న పారిశ్రామిక వేత్త నస్లి వాడియా రతన్ టాటా, టాటాసన్స్ వాటి డైరెక్టర్లపై 3వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ముంబయి హైకోర్టులో గురువారం ఈ దావా పిటిషన్ దాఖలైనట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్ తదితర టాటా కంపెనీల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా వాడియా కొనసాగుతున్నారు. ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ బోర్డుల నుంచి చైర్మన్ సైరస్ మిస్ర్తి, వాడియాలను తొలగించేందుకు టాటా సన్స్ ఇజిఎమ్కు పిలుపునిచ్చింది. ఈ కంపెనీల్లో కొన్నింటిని చేజిక్కించుకునేందుకు వాడియా ప్రయత్నిస్తున్నారని టాటాలు ఆరోపించారు.