బిజినెస్

త్రైమాసిక ఫలితాలే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఐటిరంగ సంస్థలైన టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయ. దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండవచ్చని కేంద్రం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. తయారీ, గనులు, నిర్మాణ రంగాల్లో నెలకొన్న మందగమనమే జిడిపి వృద్ధిరేటు తగ్గుదలకు కారణమని గత శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌ను జిడిపి గణాంకాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా చెప్పుకోదగ్గవేమీ లేకపోవడంతో మదుపరుల ఆలోచనా సరళినే కీలకమని చెబుతున్నారు. వారి పెట్టుబడులే మార్కెట్లను నిలబెట్టడమా? పడగొట్టడమా? అన్నదాన్ని నిర్ధారిస్తాయని అంటున్నారు. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలూ మార్కెట్ ట్రేడింగ్‌ను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. నిన్నమొన్నటిదాకా కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులను కలవరపెట్టినది తెలిసిందే. అయతే నేడు కొత్త నోట్ల సరఫరా పెరగడం, ఎటిఎమ్‌లలో 2 వేల రూపాయల నోట్లతోపాటు 500 రూపాయల నోట్లూ వస్తుండటం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చిల్లర సమస్య తగ్గిపోవడంతో తిరిగి కొనుగోళ్లు పుంజుకుంటున్నాయ. దీంతో ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకర్షించవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయ.
ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. శుక్రవారం ఈ కారణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమైనది తెలిసిందే. కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయ. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 133 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 58 పాయింట్లు కోలుకుంది.