బిజినెస్

ఆర్థిక మందగమనం లేదు: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందన్నది నిజం కాదని, అధిక పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శనమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గత నెల డిసెంబర్‌లో పరోక్ష పన్ను వసూళ్లు 14.2 శాతం పెరిగాయని చెప్పారు. ఎక్సైజ్ వసూళ్లు 31.6 శాతం, సేవా పన్ను వసూళ్లు 12.4 శాతం పెరిగాయని సోమవారం ఇక్కడ తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.