బిజినెస్
నేడే ఎమ్ఒఐఎల్ వాటా విక్రయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 January 2017
న్యూఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ మాంగనీస్ మైనింగ్ సంస్థ ఎమ్ఒఐఎల్లో.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం తమ వాటాను అమ్మకానికి పెట్టనుంది. 10 శాతం వాటా విక్రయం ద్వారా ఖజానాకు దాదాపు 480 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుందని అంచనా. ఒక్కో షేర్ ధరను 365 రూపాయలుగా నిర్ణయించారు. రెండు రోజులపాటు జరిగే ఈ షేర్ల విక్రయం బుధవారం కూడా అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్)లో భాగంగా వాటాను అమ్ముతుండగా, ప్రస్తుతం ఎమ్ఒఐఎల్లో కేంద్ర ప్రభుత్వానికి 75.58 శాతం వాటా ఉంది.