బిజినెస్

బడ్జెట్ వైపు మదుపరుల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: త్రైమాసిక ఆర్థిక ఫలితాలతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్.. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి తదితర అగ్రశేణి సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయ. దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై వీటి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. కాగా, ఫిబ్రవరి 1న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. సాధారణ బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుండటంతో దాని ఆధారంగా స్టాక్ మార్కెట్లు నడుస్తాయని మెజారిటీ మదుపరులు స్పష్టం చేస్తున్నారు. పన్నుల విధానం, వివిధ రంగాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మదుపరుల పెట్టుబడులను నిర్దేశిస్తాయని పేర్కొంటున్నారు. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలూ మార్కెట్ ట్రేడింగ్‌ను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. నిన్నమొన్నటిదాకా కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులను కలవరపెట్టినది తెలిసిందే. అయతే నేడు కొత్త నోట్ల సరఫరా పెరగడం, ఎటిఎమ్‌లలో 2 వేల రూపాయల నోట్లతోపాటు 500 రూపాయల నోట్లూ వస్తుండటం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చిల్లర సమస్య తగ్గిపోవడంతో తిరిగి కొనుగోళ్లు పుంజుకుంటున్నాయ. దీంతో ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకర్షించవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. అంతేగాక ముస్లీం దేశాలపై ఆంక్షలూ భారత్‌సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేయవచ్చని అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 847.96 పాయింట్ల్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 291.90 పాయింట్లు కోలుకుంది.
3న ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ లిస్టింగ్
ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీన స్టాక్ ఎక్స్‌చేంజ్ అయన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. వచ్చే నెల 3న నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో లిస్టింగ్ కానుంది. 1,243 కోట్ల రూపాయల సమీకరణే లక్ష్యంగా ఇటీవల పబ్లిక్ ఇష్యూకు బిఎస్‌ఇ వచ్చినది తెలిసిందే. దీనికి మదుపరులు బ్రహ్మరథం పట్టగా, 51 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయ. ఈ సంవత్సరం వచ్చిన మొదటి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) బిఎస్‌ఇ కావడం విశేషం.