బిజినెస్

21న ఎఫ్‌ఐపిబి వద్దకు 24 ఎఫ్‌డిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఈ నెల 21న జరిగే సమావేశంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి).. 24 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఇందులో వొడాఫోన్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తదితర సంస్థల ఎఫ్‌డిఐ ప్రతిపాదనలున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో సమావేశమయ్యే ఎఫ్‌ఐపిబి బోర్డు ఈ ప్రతిపాదనలన్నింటినీ పరిశీలించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.