బిజినెస్

రూ. 153 కోట్లిచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికిగాను ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపార్ యోజనలో భాగంగా గడచిన 58 రోజుల్లో దాదాపు 10 లక్షల మందికి 153.5 కోట్ల రూపాయలను బహుమతులుగా ఇచ్చినట్లు నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ మంగళవారం ఇక్కడ తెలిపారు. మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డిజిటల్ పేమెంట్ యాప్ బిహెచ్‌ఐఎమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య 17 మిలియన్లను దాటిందని కాంత్ చెప్పారు. త్వరలో ఈ యాప్‌ను ప్రమోట్ చేయడానికి వివిధ కార్యక్రమాలను ప్రారంభిస్తామని కూడా ఆయన తెలిపారు.