బిజినెస్

మరో రెండు జియో ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఉచిత కాల్స్, డేటా ఆఫర్లతో దేశీయ టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. దూకుడు కొనసాగుతోంది. ఏప్రిల్ 1 నుంచి డేటా వినియోగంపై చార్జీలుంటాయని ప్రకటించిన జియో.. 99 రూపాయల ప్రైమ్ ప్లాన్ సభ్యత్వంతో నెలనెలా 303 రూపాయలకే ఉచిత కాల్స్, డేటా సౌకర్యాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రస్తుత కస్టమర్లకు కల్పించినది తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో రెండు కొత్త టారీఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 149 రూపాయలతో రీచార్జ్ చేసుకున్న వారికి ఉచిత వాయిస్ కాల్స్, 2జిబి డేటాను నెల రోజులపాటు అందిస్తామని చెబుతోంది. అలాగే 499 రూపాయల రీచార్జ్‌కు ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు రోజుకు 2జిబి చొప్పున నెలంతా ఇస్తామని అంటోంది. జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ కూడా ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోమింగ్ చార్జీలను ఎత్తివేసినది తెలిసిందే. అంతర్జాతీయ కాల్స్, డేటా చార్జీలనూ భారీగా తగ్గించింది.