బిజినెస్

సింగరేణి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలోగల జవహర్ ఖని-5 ఓపెన్ కాస్ట్ బొగ్గు గని విస్తరణకు పర్యావరణ అనుమతి లభించింది. ప్రస్తుతం ఏడాదికి 2 మిలియన్ టన్నులు న్న ఉత్పత్తిని 2.50 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు సింగరేణి సంస్థకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతిని మంజూరు చేసింది. షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యం లో 2020 నాటికి బొగ్గు ఉత్పాదనను 1.5 బిలియన్ టన్నులకు చేర్చాలన్న సింగరేణి సంకల్పం నెరవేరుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి.