బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్ రంగాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న మొండి బకాయిల సమస్యకు పరిష్కారాన్ని చూపుతామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భరోసాను మదుపరులు విశ్వసించారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 89.24 పాయింట్లు పుంజుకుని 29,421.40 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 21.70 పాయింట్లు పెరిగి, మరోసారి 9,100 మార్కును అధిగమిస్తూ 9,108 వద్ద నిలిచింది. ఈ వారంలో వరుసగా మూడు రోజులపాటు నష్టాలను చవిచూసిన సూచీలు.. గురువారం లాభాలను అందుకున్నది తెలిసిందే.