బిజినెస్

ఏపికి పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోయినా పారిశ్రామిక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతునే ఉంది. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రంగానికి కొన్ని రాయితీలు వచ్చే మాట వాస్తవమే అయినప్పటికీ అంతకు మించిన అంశాలు కూడా ఉంటాయని దీనితో రుజువైంది. ఏదైనా ఒక ప్రాంతంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ప్రధానంగా ఆ ప్రాంతంలో లభించే వనరులు (ముడిపదార్థాలు) భూమి, నైపుణ్యత కలిగిన మానవవనరులు ప్రభుత్వం కల్పించే రాయితీలు వౌలిక వసతుల ఆధారంగా ఆసక్తి ప్రదర్శిస్తారు. వీటికి మించి విదేశాల్లో స్థిరపడిన సంపన్న వర్గాలకు జన్మభూమిపై మక్కువ కూడా మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 974 కి.మీ సముద్ర తీరం ఉంది. భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఇక నైపుణ్యత కలిగిన మానవ వనరులకు ఇక్కడ కొదవలేదు. పరిశ్రమల స్థాపనకు అవసరమైనంత భూమి కూడా అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, పారిశ్రామిక అవసరాలకు కావాల్సినంత భూమిని కేటాయిస్తోంది. అలాగే జాతీయ రహదారులు, విద్యుత్, ఫైబర్ నెట్, పోర్టులు, అంతర్గత జలరవాణా వంటి వౌలిక వసతుల కల్పనకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనేక రాయితీలు కల్పిస్తోంది. దాంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.25 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి రేటు 2015-16 నాటికి 11.1 శాతంగా నమోదై రెండంకెల వృద్ధి రేటు సాధించి రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన గణాంకాలు ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి రూ. 63,229 కోట్లు (2011-12 ధరల ఆధారంగా) తో 9.98 శాతం వృద్ధి రేటు నమోదైంది. పారిశ్రామిక వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అయిదేళ్లకు (2015-2020) రూపొందించిన పారిశ్రామిక విధానం మంచి ఫలితాలినిస్తోంది. వివిధ రంగాల్లో రూ. 3,17,000 కోట్ల పెట్టుబడులు, 28,25,000 ఉద్యోగాలు లక్ష్యంగా వివిధ పాలసీలను రూపొందించింది. ప్రభుత్వ విధానాలు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖలు తీసుకునే చర్యల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పాలసీ రూపొందించిన ఏడాదిలోనే పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. ప్రభుత్వం పది ప్రధాన రంగాలను గుర్తించి వాటిని ప్రోత్సహిస్తోంది. ఆగ్రో అండ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్స్, వస్త్రాలు - దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ - ఆటో విడిభాగాలు, పెట్రోకెమికల్స్, ఇంధనం, మినరల్ ఆధారిత పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ రంగాలు రాష్ట్రంలో విస్తరించడానికి అవకాశం ఉంది. దాంతో ఈ రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. పరిశ్రమల స్థాపనకు, వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత సంవత్సరం 2వ స్థానంలో ఉన్న ఏపి ఈ ఏడాది మొదటి స్థానానికి ఎగబాకింది. ప్రపంచ బ్యాంకు ఎనర్జీ ఎఫిషియన్సీ 2016, నవంబర్ నివేదిక ప్రకారం విద్యుత్‌ని ఆదా చేయడంలో, సమర్ధవంతంగా వినియోగించడంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపి దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. 2015-16లో ఏపి నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆ విధంగా ఏపి మొదటి స్థానంలో ఉంది. వౌలిక సదుపాయాల కల్పన విభాగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచి ఇండియాటుడే అవార్డు గెలుచుకుంది. అలాగే ఆర్బీఐ 2016, సెప్టెంబర్ బులిటెన్ ప్రకారం ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపి మొదటి స్థానానికి ఎగబాకింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్ అంచనాలపై చేసిన అధ్యయనంలో దేశంలో ఏ రాష్ట్రం సాధించనంతటి వృద్ధిని ఏపి సాధించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద రాష్ట్రానికి 81 శాతం పారిశ్రామిక పెట్టుబడులు రాగా 2015-16లో 158 శాతం పెట్టుబడులు వచ్చాయి. అంటే ఒక ఏడాది కాలంలో 77 శాతం పెట్టుబడులు పెరిగాయి. గత ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి) వృద్ధి రేటులో కూడా దేశం మొత్తం మీద ఏపి మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 7.3 శాతం ఉండగా రాష్ట్రం 10.5 శాతం వృద్ధి రేటు సాధించింది. తలసరి ఆదాయం రాష్ట్రంలో తొలిసారిగా లక్ష రూపాయలకు పైగా నమోదైంది. ఏడు జిల్లాలలో తలసరి ఆదాయం లక్ష రూపాయలు, అంతకు మించి ఉంది. విద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించిన సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌వెస్ట్‌మెంట్ మీట్, సీఐఐ (కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), కేంద్ర ప్రభుత్వ ఇండిస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, రాష్ట్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖల ఆధ్వర్యంలో 2016 జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు నుంచి ఫలితాలనిచ్చింది. రూ. 4.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 50 శాతం వరకు ఆచరణలోకి వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ. 10.50 లక్షల కోట్ల పెట్టుబడులు పట్టే ప్రతిపాదనలు వచ్చాయి. 664 ఒప్పందాలు (ఎంఓయు) జరిగాయి. ఈ పెట్టుబడులు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో అధిక భాగం పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతిపాదలన్నీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భాగస్వామ్య సదస్సు ద్వారా కుదిరిన ప్రతి అవగాహన ఒప్పందం వాస్తవరూపం దాల్చడానికి ఎస్కార్ట్ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.