బిజినెస్
రూ. 5.62 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 April 2017
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దిగుమతి సుంకం ఎగవేత కేసు విచారణలో భాగంగా ఇద్దరు దిగుమతిదారుల నుంచి 5.62 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డిఆర్ఐ). చైనా, తైవాన్ దేశాలలో కొనుగోలు చేసిన వస్తువులను భారత్కు తీసుకువస్తూ అక్కడ చెల్లించిన దానికంటే తక్కువగా చూపిస్తూ దిగుమతి సుంకాన్ని తప్పించుకుంటున్నారన్న ఆరోపణలపై జరిపిన సోదాల్లో ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ తెలిపింది. కాగా, దిగుమతిదారుల నివాసాల నుంచి సీజ్ చేసిన నగదు మొత్తం కొత్త 500, 2,000 రూపాయల నోట్లలోనే ఉందని శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో డిఆర్ఐ వెల్లడించింది.