బిజినెస్

జియో ‘్ధన్ ధనా ధన్’ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రిలయన్స్ జియో మంగళవారం మరో సరికొత్త ప్లాన్‌ను వినియోగదారులకు ప్రకటించింది. తమ ప్రైమ్ సభ్యులకు 309 రూపాయలకే 3 నెలలపాటు రోజుకు 1జిబి డేటాను 4జి వేగంతో అందిస్తామని తెలిపింది. అలాగే 509 రూపాయలకు 3 నెలలపాటు రోజుకు 2జిబి డేటాను 4జి వేగంతో ఇస్తామని చెప్పింది. ఈ రెండు ఆఫర్లు కూడా దేశీయంగా అపరిమిత ఎస్‌ఎమ్‌ఎస్, కాలింగ్ సదుపాయాలున్నవేనని స్పష్టం చేసింది. కాగా, ఈ ఆఫర్ల పేరును ‘్ధన్ ధనా ధన్’ అని ప్రకటించిన జియో.. తొలి రిచార్జ్‌కు మాత్రమే వర్తిస్తుందని తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ అమ్మకాలను ఆపేయాలని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశించిన వారంలోపే తాజా ఆఫర్‌తో జియో ముందుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ప్రత్యర్థి ఎయర్‌టెల్ మాత్రం తాజా జియో ఆఫర్‌ను కొత్త సీసాలో పాత సారాయగా అభివర్ణించింది.