బిజినెస్

దేశవ్యాప్తంగా ఒకే ధరకు పెప్సీ మినరల్ వాటర్ బాటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రముఖ విదేశీ శీతల పానియాల తయారీ సంస్థ పెప్సీ.. ఇకపై భారతదేశవ్యాప్తంగా ఒకే ధరకు త్రాగునీరును అమ్మనుంది. ఆక్వాఫినా పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మినరల్ వాటర్‌ను మార్కెట్‌లో పెప్సీ విక్రయిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వాటర్ బాటిళ్లపై ఒకే ఎమ్‌ఆర్‌పి ధర ఉండనుందని కేంద్ర ఆహార, వినియోగదారుల సంబంధాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాణ్ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. బిసిసిఐ కూడా ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని క్రికెట్ స్టేడియాల్లో ఈ వాటర్ బాటిళ్లను ఒకే ధరకు అమ్ముతుందని చెప్పారు. పెప్సీ నిర్ణయం అన్ని ప్యాకేజ్డ్ ఆహార, బేవరేజెస్ ఉత్పత్తులపై ఒకే ధర ముద్రణకు నాంది పలకగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.