బిజినెస్

పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఉచిత 4జి డేటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారతీ ఎయిర్‌టెల్.. డేటా ధరలపై యుద్ధాన్ని ప్రీ-పెయిడ్ కస్టమర్ల నుంచి పోస్ట్-పెయిడ్ కస్టమర్ల వరకు తీసుకెళ్లింది. రిలయన్స్ జియో ఇస్తున్న ఆఫర్లకు పోటీగా రాబోయే మూడు నెలలకుగాను తమ పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు ఉచిత 4జి డేటాను ఇస్తున్నట్లు ప్రకటించింది. నెట్‌వర్క్, ప్లాన్లను మార్చే యోచనలో ఉన్నవారిని అడ్డుకోవడంలో భాగంగానే ఈ ఆఫర్ అని తెలుస్తోంది. కాగా, ఈ నెల 30లోగా ‘మై ఎయిర్‌టెల్’ యాప్‌లోకి లాగినైన పోస్ట్-పెయిడ్ కస్టమర్ల కోసం 30 జిబి వరకు ఉచిత 4జి సేవలను ఆఫర్ చేస్తోంది. ఇక నెలకు 10 జిబి చొప్పున మూడు నెలలపాటు ఈ ఉచిత డేటాను పోస్ట్-పెయిడ్ కస్టమర్లు వినియోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ సిఇఒ గోపాల్ విఠల్ స్పష్టం చేశారు.