బిజినెస్

మళ్లీ సమ్మె బాటలో జ్యుయెలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నగల వర్తకులు మళ్లీ సమ్మె బాట పట్టారు. ఢిల్లీతోసహా దేశవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం బంద్ నిర్వహించారు. వెండియేతర ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత సరఫ సంఘం ఉపాధ్యక్షుడు సురీందర్ కుమార్ జైన్ పిటిఐతో మాట్లాడుతూ ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో జ్యుయెలరీ షోరూమ్‌లు మూతబడ్డాయన్నారు. కాగా, జంతర్‌మంతర్ వద్ద వ్యాపారులు ధర్నా కూడా చేయగా, ఈ బంద్ మూడు రోజులపాటు కొనసాగుతుందని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి.