బిజినెస్

ఉద్యోగుల కోతపై టెక్ మహీంద్ర దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: దేశీయ ఐటి రంగ సంస్థలు ఉద్యోగుల కోతకు క్యూ కడుతున్నాయి. మొన్న విప్రో, నిన్న ఇన్ఫోసిస్, నేడు టెక్ మహీంద్ర.. వందలాది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో అమెరికా ప్రాజెక్టులకు భారత్ నుంచి ఉద్యోగులను పంపించలేని పరిస్థితిని దేశీయ ఐటి సంస్థలు ఎదుర్కొంటున్నది తెలిసిందే. అమెరికా ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు స్థానికులనే నియమించుకుంటుండగా, వ్యయభారం తగ్గించుకోవడానికి దేశీయంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగుల పనితీరు ఆధారంగా కోతలేస్తున్నాయి.