బిజినెస్

మాల్యా అప్పగింత కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 13: బ్యాంకు రుణాల ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి సంబంధించి లండన్ కోర్టులో ఉన్న కేసు విచారణ జూన్ 13కు వాయిదా పడిందని బ్రిటన్‌కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సిపిఎస్) తెలిపింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న ఈ కేసు జూన్ 13న విచారణకు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం తరపున సిపిఎస్ వాదించనుంది. షెడ్యూలు ప్రకారం మే 17న జరగాల్సిన ఈ కేసు విచారణ జూన్ 13కు వాయిదా పడిందని సిపిఎస్ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లకు చెందిన నలుగురు సభ్యులతో కూడిన ఒక సంయుక్త బృందం ఈ కేసుకోసం ఈ నెల మొదట్లోనే లండన్‌కు చేరింది.