బిజినెస్

కృష్ణపట్నం రేవులో ఎగుమతుల కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, మే 15: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులో ఎగుమతులు దిగుమతులు కేంద్రాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి అర్జున్‌రాం మేఘవాల్ ప్రారంభించారు. సోమవారం కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటి సర్వీసెస్ ప్రాంగణంలో ఈకార్యక్రమం జరిగింది.అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కృష్ణపట్నం ఓడరేవు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచిందని ప్రశంసించారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొలంబో చెన్నై, సింగపూర్ పోర్టులతో పోల్చుకుంటే కృష్ణపట్నం పోర్టు అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఇతర దేశాలకు ఓడరేవునుంచి ఎగుమతులు, దిగుమతులు కార్యకలాపాలు జరగడం హర్షణీయమన్నారు. దేశంలోని అత్యుత్తమ సాంకేతికత కలిగిన పోర్టు కృష్ణపట్నం పోర్టుఅని కేంద్ర మంత్రి కొనియాడారు. ఆయన వెంట బిజెపి నేతలు, కృష్ణపట్నంపోర్టు సిఇఒ అనిల్ యండ్లూరి, కృష్ణపట్నం పిఆర్ హెడ్ వేణుగోపాల్, శిక్షణా కేంద్రం జిఎం రాజేంద్ర ప్రసాద్ కస్టంస్ అధికారులు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.