బిజినెస్

భారతీయులకు బంగారమే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 2008-17 మధ్య కాలంలో 124 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. ఈ క్రమంలో పలు భారతీయ అత్యుత్తమ సంస్థల్లో పెద్ద ఎత్తున వాటాలనూ సొంతం చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో దేశీయ మదుపరులు మాత్రం బంగారంపై పెట్టుబడులను భారీగా పెట్టారు. దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడిని దక్కించుకున్నారు. ఈ మేరకు కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తమ తాజా నివేదిక ద్వారా తెలిపింది. మరోవైపు దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు ఈ నెలా పోటెత్తుతున్నాయ. జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. ప్రస్తుత నెల జూన్‌లో కూడా 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. ఈ నెల 1-23 మధ్య స్టాక్ మార్కెట్లలోకి 3,282 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్లలోకి 22,508 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 25,791 కోట్ల రూపాయలుగా నమోదైంది. కాగా, మార్చిలో రికార్డు స్థాయలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. ఏప్రిల్‌లోనూ దాదాపు 23 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చారు. మే నెలా సుమారు 25 వేల కోట్ల రూపాయలు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్ల కంటే కూడా రుణ మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పిఐలు అమితాసక్తిని కనబరుస్తుండటం విశేషం. కాగా, మే నెల మొదట్లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేసిన విదేశీ మదుపరులు.. రెండో వారం నుంచి కొనుగోళ్లకు దిగారు. 2019లో ఎన్నికలు రానున్నది తెలిసిందే. దీంతో ఈ రెండేళ్లలో మోదీ సర్కారు మరిన్ని సంస్కరణలు తెస్తుందన్న విశ్వాసంతోనే విదేశీ మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. కాగా, వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 2,394 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి 20,364 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం 22,758 కోట్ల రూపాయల (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చినట్లైంది. ఫలితంగా ఫిబ్రవరి-మే మధ్య వచ్చిన పెట్టుబడుల విలువ 1.33 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి 1.44 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. కాగా, 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 23,079 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్లు, అంతకుముందు అక్టోబర్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలోనూ 3,496 కోట్ల రూపాయలు వెనక్కిపోగా, ఈ నాలుగు నెలలు కలుపుకుని 80,310 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. ఇలా 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.