బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుండటం వంటివి మదుపరుల పెట్టుబడులను అమితంగా ప్రభావితం చేయవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. జూలై 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తుంగా, ఈ పరోక్ష పన్నుల విధానంలో 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం పన్ను రేట్లను కేటాయంచింది. బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను విధించగా, విద్య, వైద్యం, తాజా కూరగాయలు వంటి వాటికి మినహాయంపునిచ్చింది. అయతే అధిక పన్ను విధించారన్న భావనలో ఉన్న పలు రంగాలు తమపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నాయ. దీంతో కొన్నింటిని కేంద్రం సవరిస్తోంది కూడా. గత సమావేశంలోనూ 66 వస్తువులపై జిఎస్‌టి కౌన్సిల్ పన్నులను తగ్గించింది. ఈ నెల 30న మరోసారి కౌన్సిల్ భేటీ కానుంది. దీంతో వీటన్నిటి ప్రభావం మదుపరుల పెట్టుబడులపై ఉంటుందంటున్నారు మార్కెట్ నిపుణులు. మరోవైపు జిఎస్‌టి అమలును వాయదా వేయాలన్న ప్రతిపాదనలు నానాటికీ అధికమవుతుండటంతో దీనిపై ప్రభుత్వ స్పందనపట్లా మదుపరులు అమితాసక్తిని చూపిస్తున్నారు. వాయదా వేయడం కుదరదని మోదీ సర్కారు తెగేసి చెబుతున్నప్పటికీ, వాయదా అభ్యర్థనలు వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి ఎక్కువగా వస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనా.. ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చన్న అంచనాలున్నాయ. కాగా, క్రిందటి వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 81.81 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.10 పాయంట్లు పడిపోయాయ. సెనె్సక్స్ 31,138 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,574 వద్ద నిలిచింది. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.