బిజినెస్

కార్ల ధరలను తగ్గించిన మహీంద్ర అండ్ మహీంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో దేశీయ ఆటో రంగ సంస్థలు వాహన ధరలను తగ్గిస్తున్నాయ. మంగళవారం మహీంద్ర అండ్ మహీంద్ర తమ యుటిలిటి వాహనాలపై, ఎస్‌యువిలపై 6.9 శాతం ధరలను తగ్గించింది. ఇప్పటికే మారుతి సుజుకి, టొయోట కిర్లోస్కర్, జాగ్వార్ లాండ్‌రోవర్, బిఎమ్‌డబ్ల్యు, ఫోర్డ్, హోండా కార్స్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, టివిఎస్, సుజుకి సంస్థలు తమ కార్లు, టూవీలర్ల ధరలను తగ్గించాయ. కార్ల ధరలు గరిష్ఠంగా 2 లక్షల రూపాయలకుపైగా తగ్గితే, ద్విచక్ర వాహనాల ధరలు 6,000 రూపాయల వరకు తగ్గాయ. జిఎస్‌టిలో 1,500 సిసి సామర్థ్యానికి పైనున్న భారీతరహా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్స్ (ఎస్‌యువి)పై 28 శాతం పన్ను విధించారు. మరో 15 శాతం సెస్ అదనంగా వేశారు. అయినప్పటికీ గతంలో పడిన పన్ను కంటే ఇది తక్కువే. ఇంతకుముందు దాదాపు 50 శాతం పన్నుండేది. దీంతో ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయ.