బిజినెస్

‘ఎయిరిండియా వాటా అమ్మకంపై వివరాలివ్వండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయానికి సంబంధించిన వివరాలను తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఓ పార్లమెంటరీ కమిటీ. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాను విక్రయించాలని మోదీ సర్కారు నిర్ణయించినది తెలిసిందే. దీంతో ప్రైవేటీకరణ దిశగా ఎయిరిండియా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి అన్ని వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ, విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిరిండియాకు చెందిన అధికారులు ఈ వారం తెలియజేసే అవకాశాలున్నాయి.