బిజినెస్
17న ఎన్ఎస్ఇ చీఫ్గా లిమయే బాధ్యతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 15 July 2017
న్యూఢిల్లీ, జూలై 14: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఇ).. తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా సీనియర్ బ్యాంకర్ విక్రమ్ లిమయే సోమవారం నుంచి బాధ్యతలు చేపడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సుప్రీం కోర్టు అప్పగించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) బాధ్యతల నిర్వహణ ముగిసిపోవడంతో ఈ నెల 17 నుంచి ఆయన ఎన్ఎస్ఇ ఎండి, సిఇఒగా పని చేయనున్నట్లు ఓ ప్రకటనలో ఎన్ఎస్ఇ తెలియజేసింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్ట్భద్రులైన లిమయే.. 1987లో తన కెరీర్ను మొదలుపెట్టారు.