బిజినెస్

విదేశీ మదుపరుల్లో జిఎస్‌టి జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతు న్నాయ. ఈ నెల దాదాపు 11,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్లలోకి కేవలం 498 కోట్ల రూపాయల పెట్టుబడులే రాగా, రుణ మార్కెట్లలోకి మాత్రం 10,405 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరోక్ష పన్నుల విధానం మదుపరుల మెప్పు పొందడంతో విదేశీ పెట్టుబడుల రాక కొనసాగింది. మరోవైపు ఈ ఏడాది ప్రథమార్ధంలో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. నిరుడు జనవరి-జూన్ మధ్య కేవలం 1.2 బిలియన్ డాలర్ల (7,600 కోట్ల రూపాయలు) పెట్టుబడులే వచ్చాయ.
కాగా, ఈ సంవత్సరం జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. గత నెలలో కూడా 4.55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. జూన్‌లో మొత్తం 29 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు. ఈ క్రమంలో 2017 జనవరి-జూన్ మధ్య వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 22.66 బిలియన్ డాలర్లను తాకింది. అయతే స్టాక్ మార్కెట్లలోకి స్వల్ప మొత్తంలో పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి మాత్రం పెద్ద ఎత్తున పట్టుకొచ్చారు. స్టాక్ మార్కెట్లలోకి 53,354 కోట్ల రూపాయలు (8.2 బిలియన్ డాలర్లు), రుణ మార్కెట్లలోకి 94,199 కోట్ల రూపాయలు (14.5 బిలియన్ డాలర్లు) తెచ్చారు. మొత్తం 1,47,553 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లైంది. కాగా, మార్చిలో రికార్డు స్థాయలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. ఏప్రిల్‌లోనూ దాదాపు 23 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చారు. మే నెలా సుమారు 25 వేల కోట్ల రూపాయలు వచ్చాయ.
అయతే మొదట్లో షేర్ల అమ్మకాలకే పెద్దపీట వేసిన విదేశీ మదుపరులు.. రెండో వారం నుంచి కొనుగోళ్లకు దిగారు. 2019లో ఎన్నికలు రానున్నది తెలిసిందే. దీంతో ఈ రెండేళ్లలో మోదీ సర్కారు మరిన్ని సంస్కరణలు తెస్తుందన్న విశ్వాసంతోనే విదేశీ మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఒంటరిగానే అధికారంలోకి రావడం, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చేజిక్కించు కోవడం మదుపరులను విపరీతంగా ఆకట్టుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ బాగు కోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకునేందుకు వెనుకాడ బోమన్న సంకేతా లను మోదీ ప్రభుత్వం ఇచ్చింది. కాగా, వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకుపైగా పెరిగింది.
స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 2,394 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి 20,364 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం 22,758 కోట్ల రూపాయల (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చినట్లైంది. ఫలితంగా ఫిబ్రవరి-మే మధ్య వచ్చిన పెట్టుబడుల విలువ 1.33 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది.
కాగా, 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 23,079 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్లు, అంతకుముందు అక్టోబర్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలోనూ 3,496 కోట్ల రూపాయలు వెనక్కిపోగా, ఈ నాలుగు నెలలు కలుపుకుని 80,310 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. ఇలా 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయల (24 బిలియన్ డాలర్లు)కు చేరింది.