బిజినెస్

కిలో పొగాకు ధర రూ. 200!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జూలై 21: ఊహించిన విధంగానే పొగాకు ధర రికార్డు బద్దలయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోని అయిదు కేంద్రాలకుగాను మూడు కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన వేలంలో కిలో గరిష్ఠ ధర రూ. 200 పలికింది. దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం-1 కేంద్రాల్లో ఈ ధర పలికింది. ఇది దేశంలోనే రికార్డు. 2012లో పలికిన కిలో రూ. 199.80 ధరే ఇప్పటివరకు దేశీయ రికార్డుగా ఉంది. తాజాగా శుక్రవారం రూ. 200 పలకడంతో కొత్త రికార్డు సృష్టించినట్టయ్యింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు దిగుబడి తగ్గడంతో ఈ ధర పలికినట్టు రైతులు చెబుతున్నారు.