బిజినెస్

పెగా సిస్టమ్స్ విస్తరణ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ నగర కేంద్రంగా పనిచేస్తున్న పెగా సిస్టమ్స్ తన కార్యాలయాన్ని పెద్దఎత్తున విస్తరించింది. ప్రశాంత వాతావరణంలో సిబ్బంది పని చేసేందుకు, పని బృందాలు ఒకటిగా పని చేసేందుకు వీలుగా విశాలమైన కొత్త అంతస్తును తయారు చేసింది. హైటెక్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్ ఐటి పార్క్‌లోని 11వ అంతస్తులో కార్యాలయాన్ని విస్తరించినట్లు కంపెనీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఈ కొత్త అంతస్తును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెగా సిస్టమ్స్ ఇండియా ఎండి సుమన్ రెడ్డి మాట్లాడుతూ 2007లో తమ కంపెనీ ఆర్‌అండ్‌డి సెంటర్‌ను స్థాపించిందన్నారు. ఇంజినీరింగ్ సర్వీస్, సొల్యూషన్స్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్, గ్లోబల్ క్లౌడ్ సపోర్ట్ వంటి సేవలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 58 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోగల నూతన అంతస్తులో అన్ని అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తమ కార్యాలయ విస్తరణను ప్రారంభించినందుకు వచ్చిన మంత్రి కెటిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

చిత్రం.. పెగా సిస్టమ్స్ నూతన కార్యాలయంలో కెటిఆర్