బిజినెస్

ఎఫ్‌ట్యాప్సీ వైస్ ప్రెసిడెంట్‌గా కరుణేంద్ర ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఎఫ్‌ట్యాప్సీ) వైస్ ప్రెసిడెంట్‌గా పారిశ్రామికవేత్త కరుణేంద్ర ఎస్ జాస్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఇక్కడ ఫెడరేషన్ హౌస్‌లో జరిగిన చాంబర్ సమావేశంలో కరుణేంద్రను ఎన్నుకున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాయ్ లాజిస్టిక్స్ ఎల్‌ఎల్‌పి భాగస్వామిగా ఉన్న కరుణేంద్ర 2005 నుంచి 2012 వరకు చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. టూరిజం, వౌలిక సదుపాయాలకు గతంలో చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం పరోక్ష పన్నుల క్రిటికల్ కమిటీకి పని చేస్తున్నారు. స్టే ప్యాక్ గ్రూప్‌ను ఆయన స్థాపించి హైదరాబాద్, పుణే, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బ్రాంచి కార్యాలయాలను ఏర్పాటు చేశారు.