బిజినెస్

పెరిగిన వ్యయభారంతో సెయల్‌కు మరింత నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయల్) స్టాండలోన్ నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే మరింత పెరిగింది. 801.38 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 535.52 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. మహారత్న హోదా కలిగిన సెయల్ ఆదాయం ఈసారి 13,072.77 కోట్ల రూపాయలుగా, పోయినసారి 10,424.95 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, సంస్థాగత వ్యయం గతంతో పోల్చితే ఈసారి 11,296.16 కోట్ల రూపాయల నుంచి 14,349.89 కోట్ల రూపాయలకు పెరిగింది. దీంతో అధిక వ్యయభారంతోనే సంస్థ నష్టాలు పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది.